Header Banner

పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

  Sun Jun 01, 2025 08:32        Politics

పేదల జీవితాలను మెరుగుపరచడానికి, 2029 నాటికి పేదరికం లేని సమాజాన్ని సాధించడమే లక్ష్యంగా "పీ4" కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరులో శనివారం జరిగిన పీ4 ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ, తాను, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆలోచిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. భగవంతుడు కరుణిస్తే పింఛను మొత్తాన్ని మరింత పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వం భర్త చనిపోయిన మహిళలకు పింఛన్లు ఇవ్వలేదని, ఈ నెలలో కొత్తగా మొత్తం 71,380 మంది వితంతువులకు రూ.4 వేల చొప్పున పెన్షన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. చెయ్యేరులో ఉపాధి పనులు జరిగే చోట లబ్ధిదారులకు చంద్రబాబు పింఛను అందజేశారు. అంతేకాకుండా గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తామని, అన్ని ఆసుపత్రుల్లోని రోగుల వివరాలు సేకరించి ఏఐతో అనుసంధానం చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం 94 పథకాలకు కేంద్రం డబ్బులు ఇస్తే, వాటిని వేరే వాటికి వాడటం వల్ల రాష్ట్రాన్ని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టే పరిస్థితికి తెచ్చారని చంద్రబాబు విమర్శించారు.

తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వాటా చెల్లించి 74 పథకాలను మళ్లీ ప్రారంభించామని చెప్పారు. అన్ని ఆసుపత్రుల్లోని రోగుల వివరాలు సేకరించి ఏఐతో కలిపి వ్యాధులు రాకుండా, వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలుసుకుంటామని సీఎం అన్నారు. దీని కోసం గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తామని, కుప్పంలో ఒక ప్రాజెక్టును మొదలుపెట్టామని తెలిపారు. ఆ జిల్లాలో ఆరు నెలల్లో.. రాష్ట్రవ్యాప్తంగా రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించి, డేటాను భద్రపరుస్తామని అన్నారు.


ఇది కూడా చదవండి: విశాఖ టూ శ్రీలంక ప్రత్యేక టూర్! ఇప్పుడు తక్కువ ధరలోనే!


గతంలో ఉద్యోగుల పీఎఫ్ డబ్బులు వాడేశారని, రూ.7,500 కోట్లు తిరిగి వారికి చెల్లించామని తెలిపారు. "సూపర్‌ సిక్స్‌" హామీలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని చంద్రబాబు చెప్పారు. ఈ నెలలో అన్నదాతా సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామని, పాఠశాలలు తెరిచేలోగా పిల్లలందరికీ రూ.15 వేల చొప్పున "తల్లికి వందనం" ఇస్తామని, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

కొందరు తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాజమండ్రిలో ఒక పాస్టర్ చనిపోతే, ఎవరో చంపారని బురద జల్లాలని ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. తనది డేగకన్ను అని.. ఎవరు తప్పు చేసినా టెక్నాలజీతో కనిపెడతానని చంద్రబాబు హెచ్చరించారు.

ఒకప్పుడు కోనసీమలో జీడీపీ బాగుండేదని, కరువు జిల్లా అనంతపురం వెనుకబడి ఉండేదని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు కోనసీమ వెనుకబడి ఉందని, అనంతపురం అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు. జూన్ 12 నుంచి పాలనలో మార్పులు చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల గోదావరిలో స్నానానికి దిగి చనిపోయిన 8 మంది పిల్లల తల్లిదండ్రులకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు.

పీ-4లో భాగంగా చెయ్యేరులో 141 బంగారు కుటుంబాలను గుర్తించామని, ప్రస్తుతం 9 మంది సహాయం చేయడానికి ముందుకు వచ్చారని చంద్రబాబు చెప్పారు. అంతకుముందు ఇద్దరు విద్యార్థినులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. మడికి లక్ష్మి అనే మహిళ తన భర్త క్యాన్సర్‌తో చనిపోయాడని, కూలి పనులు చేస్తూ ముగ్గురు ఆడపిల్లల్ని చదివిస్తున్నానని చెప్పి బోరున ఏడ్చింది. ఆమె కష్టానికి చలించిపోయిన చంద్రబాబు వెంటనే పిల్లల్ని పిలిచి వారి మాట్లాడారు. ఆ కుటుంబాన్ని దత్తత తీసుకున్న నాగేంద్రరావు వారిని చదివిస్తానని, ఇల్లు కట్టుకోడానికి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే, మరో ఐదు కుటుంబాలను దత్తత తీసుకుంటానని ముఖ్యమంత్రికి ఆయన చెప్పారు.

రెండో బంగారు కుటుంబానికి చెందిన ఉప్పలపాటి సత్యవతి తన భర్త బట్టలు ఇస్త్రీ చేస్తాడని, పని సరిగ్గా లేక పోషణ కష్టంగా ఉందని వాపోయింది. రామరాజు అనే వ్యక్తి కిరాణా దుకాణం, ఇల్లు కట్టించడానికి సహాయం చేస్తానని, పిల్లలను చదివిస్తానని, మరో 5 కుటుంబాలను దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!

 

ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!

 

ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..

 


ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!

 

వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!

 

రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!

 

కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!

 

మస్క్ కు ఫేర్వెల్ పార్టీ ఇచ్చిన ట్రంప్! చివరి రోజు ఘనంగా వీడ్కోలు!

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్! రేషన్ అందదనే బెంగే అక్కర్లేదు! మంత్రి కొత్త ఆలోచన!

 

ఖరీఫ్ రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! ఆ నిధుల విడుదల..!

 

ఎన్టీఆర్ భరోసా పథకానికి ప్రజల నుండి విశేష స్పందన! ఉదయానికే 52% పంపిణీ పూర్తి!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.2లక్షలకు పైగా..! మంత్రి కీలక ఆదేశాలు!

 

డీఎస్సీ అభ్యర్థుల విజ్ఞప్తులపై ఏపీ సర్కారు సానుకూల స్పందన...! డీటెయిల్స్ ఇవిగో!


స్కూళ్లకు ఏపీ విద్యాశాఖ కీలక ఆదేశాలు.. ఎన్నడూ లేని విధంగా ఈసారి!


హైదరాబాదులో ఘనంగా ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం! తొలిసారిగా త్రివిధ దళాల సైనికాధికారులకు..


ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉచితంగా రూ.8000.. ఎవరెవరికంటే?



లిక్కర్ కేసులో వేగం పెంచిన సిట్! మొదటి రోజు విచారణలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #COVID19 #CoronaCases #IndiaHealthUpdate #StaySafe #HealthAlert #COVIDUpdate #ExpertsOpinion